నిత్యావసరాల ధరలు పెరిగి, ఆదాయం తగ్గి కరోనా కాలంలో మధ్యతరగతి ఇంటి బడ్జెట్ లెక్కతప్పుతోంది. ఈ తరుణంలో కొద్దిపాటి అవగాహనతో ఖర్చులు తగ్గించుకుని ఉపశమనం పొందవచ్ఛు తక్కువ బడ్జెట్లో జీవనం సాగించే మార్గాలను ఆశ్రయించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అవసరం, విలాసం మధ్య తేడాను గమనిస్తే బతుకుబండి సాఫీగా సాగిపోతుంది.
నిత్యా వసరాలు..
కుటుంబ బడ్జెట్ నిర్వహణలో ఇప్పుడు కచ్చితంగా ఆలోచన చేయాల్సిందే. నిత్యావసరాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. పప్పులు, కిరాణా సరకులు బ్రాండెడ్కు వెళ్లకుండా విడివిడిగా కొనుగోలు చేస్తే ధర తగ్గడంతో పాటు వీటిపై పన్ను భారం ఉండదు. శుద్ధిచేసి, పాలిష్ చేసిన పప్పులు, పంచదార లాంటి వాటన్నింటిపైనా పన్ను ఉంటుందని గమనించాలి. జీడిపప్పు, బాదం వంటి అధిక ధరలు ఉండేవి కాకుండా.. అవే పోషకాలు ఉండే స్థానికంగా దొరికే పప్పులు వాడుకోవాలి. ఇళ్లు, బహుళ అంతస్థుల భవనాల్లో సైతం బకెట్ తోటలు పెంచుకుని ఆకుకూరలు పండించుకోవచ్ఛు మునగాకు చాలా చౌకగా లభిస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. తెల్లగా మెరిసేలా కనిపించే బ్రాండెడ్ బియ్యం కంటే మిల్లు వద్ద ముతక బియ్యం కొనుగోలు చేయాలి. ధర తక్కువతోపాటు ఆరోగ్యానికి మంచిది.
విద్యుత్తు బిల్లుల్లో..
జిల్లాలో గృహ వినియోగం కనెక్షన్లు మొత్తం 1136840 ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అవసరం మేరకు విద్యుత్తు వినియోగించడం వల్ల పొదుపు పాటిస్తే సొమ్ము ఆదా అవుతోంది. ఇంట్లో మీటరు రీడింగ్ చూసుకుంటూ స్లాబులకు అనుగుణంగా పొదుపుగా వాడుకోవాలి. 100, 200, 300 ఇలా స్లాబు మారే యూనిట్ల వద్దకు వచ్చేసరికి అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలి. తక్కువ స్లాబులో ఉండటం వల్ల రూ.వందల్లో సొమ్ము పొదుపు చేసే వెసులుబాటు కలుగుతుంది. వినియోగించే యూనిట్లు పెరిగేకొద్దీ స్లాబు రేటు పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి.
అదుపే వెలుగు
- ప్రొఫెసర్ ఆంజనేయులు, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి, ఏఎన్యూ
గృహిణి నిత్యవసరాలను పొదుపుగా వాడుకుంటూ ఆదా చేసే మార్గాలను అన్వేషించాలి. సీజన్లో వచ్చే పళ్లు కాస్త తక్కువ ధరకు వస్తాయి. అవసరాలకు కొనుగోలు చేస్తూనే వాటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు, పిక్నిక్లు, వేడుకల్లో ఆడంబరాలు తగ్గించాలి. సాధారణ జీవితం గడపడానికి అలవాటు పడాలి. వస్తువు, సరకు కొనేముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. అవసరమా? ఇప్పుడే కొనాలా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి?..అనేవి ఆలోచించాలి.
అనవసర ఖర్ఛు..