ఆంధ్రప్రదేశ్

andhra pradesh

wife and husband died: భార్యాభర్తలను పొట్టన పెట్టుకున్న.. దండెం తీగ!

By

Published : Nov 16, 2021, 10:19 AM IST

ఎప్పుడో 50 ఏళ్ల కింద ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నారు. పిల్లలకు పెళ్లి చేశారు. ప్రస్తుతం జీవిత చరమాంకంలోకి ఆడుగుపెట్టారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన భార్య.. ఆమెను కాపాడబోయిన భర్త ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా(guntur district)లో జరిగింది.

current shock
current shock

విద్యుదాఘాతానికి(current shock) గురైన భార్యను కాపాడబోయి ఆమెతోపాటు తానూ మృత్యువాతపడ్డాడో భర్త.(wife and husband died) ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా(guntur district) ప్రత్తిపాడులో సోమవారం జరిగింది.

స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రత్తిపాడుకు చెందిన బట్టినేని సత్యనారాయణ (78), జయలక్ష్మి (70)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ పెద్ద కొడుకు తిరుపతయ్యతో కలిసి రేకుల షెడ్డులో ఉంటూ, పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం వేళ జయలక్ష్మి తడిచిన వస్త్రాలను ఇంటి లోపల కట్టిన ఇనుప తీగపై ఆరేస్తుండగా, ఫ్యానుకు లాగిన కరెంటు తీగ నుంచి విద్యుత్తు సరఫరా జరిగింది.

దీంతో.. ఆమె విలవిలలాడుతూ కిందపడిపోయారు. గమనించిన సత్యనారాయణ.. ఆదుర్దాగా వచ్చి భార్యను పట్టుకున్నారు. ఫలితంగా.. ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. అప్పుడే బయటి నుంచి వచ్చిన కుమారుడు తిరుపతయ్య.. పరిగెత్తుకొచ్చి కిందపడి ఉన్న తల్లిదండ్రులను లేపేందుకు ప్రయత్నించగా అతనికీ షాక్‌ తగిలింది. ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే విద్యుత్ మెయిన్‌ ఆపేసి చూడగా.. అప్పటికే తల్లిదండ్రులు మృతిచెందారు.

ఇదీ చదవండి

కదిరిలో దొంగల బీభత్సం.. ఇంట్లోకి చొరబడి మహిళ హత్య!

ABOUT THE AUTHOR

...view details