ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించితే చర్యలు తప్పవు'

గుంటూరు జిల్లా వినుగొండలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఐదుగురి మించి ఉండరాదని మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి అన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By

Published : Mar 5, 2021, 5:14 PM IST

vinugonda election special officer venkatappayya
'ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించి ఉంటే... చర్యలు తప్పవు'

గుంటూరు జిల్లా వినుకొండ ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించి ఉండరాదని మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి వెంకటప్పయ్య అన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లయోలో పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి.. రిటర్నింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వినుకొండలో పార్టీలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంపులుగా ప్రచారం చేస్తున్నాయి... ఆ వీడియోలు రోజూ స్థానికంగా ఉన్న ఓ ఛానల్​లో ప్రచారం అవుతున్నాయి. ఆ వీడియోలు పరిశీలించి గుంపులుగా ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తామని వెంకటప్పయ్య స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

15 సంవత్సరాల తర్వాత గుంటూరులో మున్సిపల్ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details