ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

22 టన్నుల రేషన్​ బియ్యం పట్టివేత - చిలకలూరిపేట తాజావార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విజిలెన్స్​ అధికారుల తనిఖీల్లో రేషన్​ బియ్యం పట్టుబడింది. రెండు వాహనాల్లో అక్రమంగా రవాణా అవుతున్న 22 టన్నుల బియ్యాన్ని సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

ration rice
రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : May 13, 2021, 8:14 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్​ యార్డ్​ చెక్ ​పోస్ట్​ వద్ద జరిపిన తనిఖీల్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం పట్టుబడినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలో 20 టన్నులు, ఆటోలో 2 టన్నులమేర అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్ల చెప్పారు.

గుంటూరు జిల్లా గణపవరం నుంచి తెలంగాణలోకి బియ్యాన్ని పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు వాహనాలను సీజ్​ చేసి… డ్రైవర్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details