ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 29, 2020, 7:03 AM IST

ETV Bharat / state

దాతలు ఇచ్చిన భూములను కూడా అమ్మకానికి పెట్టారు.

తనకున్న స్థలం పదిమందికి ఉపాధినిస్తుందని ఓ పెద్దాయన భావించారు. పేదలకోసం తన భూమిని ప్రభుత్వానికి దానమిచ్చారు. అందులో ప్రభుత్వం కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు, చిరు వ్యాపారులకు ఉపాధి లభించింది. ఏళ్ల తరబడి ఆ స్థలంలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్న సమయంలో ఉన్నమార్కెట్​పై బిల్డ్ ఏపీ పేరిట ఓ పిడుగు వచ్చి పడింది. మార్కెట్ స్థలాన్ని వేలానికి సిద్ధం చేయటంపై దాత కుటుంబీకులతో పాటు దానిపై ఆధారపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గుంటూరులోని పీవీకే మార్కెట్ ..

Vegetable  market sale in guntur
గుంటూరు పీవీకే కూరగాల మార్కెట్

గుంటూరు నగరంలోని కూరగాయల మార్కెట్​కు ఓ చరిత్ర ఉంది. 1925 నుంచే ఈ ప్రాంతంలో కూరగాయల విక్రయాలు జరిగేవి. ఈ స్థల యజమాని పసుపులేట వెంకట కృష్ణమ నాయుడు 1945లో తన భూమిని అప్పటి గుంటూరు మున్సిపాలిటికి ...మార్కెట్ కోసమని విరాళంగా అందజేశారు. ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించుకునే వారికి అద్దెకిచ్చింది. దాదాపు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అన్నింటికి మించి దుకాణాల అద్దెల రూపంలో గుంటూరు నగరపాలక సంస్థకు ఏడాదికి 80లక్షల రూపాయల పైగానే ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇలాంటి స్థలంపై ప్రభుత్వ కన్ను పడింది. బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ స్థలాలు అమ్మే క్రమంలో మొదటి విడతగా ఎంపిక చేసిన స్థలాల్లో గుంటూరు మార్కెట్ కూడా ఉంది. 1.72 ఎకరాల స్థలాన్ని67.36కోట్ల రూపాయల ధర రిజర్వ్ చేశారు. ప్రజల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తమ తాత పీవీకే నాయుడు ఈ స్థలాన్ని అప్పగిస్తే... ఊరుకోమని ఆయన కుటుంబీకులు తప్పుబడుతున్నారు. దీనిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు.

ఈ మార్కెట్ నగరానికి మధ్యలో ఉండటంతో.. అటు రైతులకు, ఇటు వ్యాపారులకు ఇదో అనువైన ప్రదేశం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు కూరగాయలతో పాటు పండ్లు, పూలు తెచ్చి విక్రయిస్తుంటారు. భౌతిక దూరం కోసం విశాలమైన మైదానంలోకి మార్కెట్​ను తరలించారు..లాక్​డైన్ తర్వాత మళ్లీ ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చని అధికారులు చెప్పారని... ఇపుడు మాత్రం మార్కెట్ స్థలాన్ని అమ్మకానికి పెట్టారని వ్యాపారులు వాపోతున్నారు. తమ జీవనాధారాన్ని నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు.

ఇక మార్కెట్ అమ్మకంపై ఆయా పార్టీల నేతలు తమదైన శైలిలో ఆందోళనలు, నిరసనలు చేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. వైకాపా ప్రభుత్వం వేలాదిమంది బతుకుదెరువును దెబ్బతీస్తోందని నాయకులు విమర్శించారు. విమర్శిస్తున్నారు. వేలం ప్రక్రియ నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు పీవీకే కూరగాల మార్కెట్

ఇదీ చూడండి.'పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకం నిలిపివేయాలి'

ABOUT THE AUTHOR

...view details