Remove YSR statue in Jonnalagadda: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ - రంగారెడ్డిపాలెం మార్గంలో ఉన్న దివంగత నేత, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియను దుండగులు తొలగించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైకాపా నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, వైకాపా శ్రేణులు.. స్థానికంగా ఉన్న గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ నిలిపోయింది.
నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా విరమించాలని వైకాపా శ్రేణులను కోరారు. తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేసే వరకూ ధర్నా విరమించేది లేదంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు నినాదాలు చేశారు. డీఎస్పీ నచ్చజెప్పడంతో వైకాపా శ్రేణులు ధర్నా విరమించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి