గుంటూరు జిల్లా తెనాలిలోని మోదుకూరు - నిడుబ్రోలు వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధురాలు.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వృద్ధురాలికి సుమారు 70 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పట్టాలు దాటుతుండగా రైలు ఢీ.. వృద్దురాలు మృతి - old woman died while crossing the train track
గుంటూరు జిల్లా మోదుకూరు - నిడుబ్రోలు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా.. ఓ వృద్ధురాలిని రైలు ఢీకొంది. అక్కడికక్కడే ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు సుమారు 70ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
రైలు పట్టాలు దాటుతుండగా వృద్దురాలు మృతి