ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: డివైడర్​ను ఢీకొన్న బైక్​.. ఇద్దరు మృతి - road accident in narasarao peta news update

నరసరావుపేటలో బైక్​ డివైడర్​ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

two young men death in road accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

By

Published : May 30, 2021, 4:37 PM IST

ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం డివైడర్​ను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమించటంతో.. మరో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగిందని నరసరావుపేట రెండో పట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details