ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా  వైద్యసేవలు మరింత చేరువ - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా... గ్రామీణులకు వైద్యసేవలు మరింత చేరువ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా... గ్రామీణులకు వైద్యసేవలు మరింత చేరువ

By

Published : Sep 14, 2019, 8:59 AM IST

గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను మరింత చేరువ చేయాలని వైద్యరంగ సంస్థల కమిటీ సూచించింది. ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులను అందుతున్న వైద్యసేవలు, సమస్యలు అమలుచేయాల్సిన సంస్కరణలుపై ఈ కమిటీ 2 నెలల పాటు చేపట్టిన అధ్యయనం ముగింపునకు చేరింది. 18న తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్​కు అందజేయబోతుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం

  • ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా వైద్యసేవలను ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంచాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టుల్లో పని చేయాలి..మూడో వైద్యుడు రాత్రి పూట విధుల్లో ఉండాలి.
  • ఈ కేంద్రాల్లో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా డిప్లోమో ఇన్ హెల్త్ మెడిసిన్ కోర్స్ లేదా పబ్లిక్ హెల్త్​లో పీజీ వైద్యవిద్య పూర్తిచేయాలి. ఇందుకు నాలుగేళ్ల గడువివ్వాలి.
  • రోగులు వైద్యులు వైద్య ఆరోగ్య శాఖద్వారా జరిగే కార్యక్రమాల పర్యవేక్షణకు సమన్వయకర్తను నియమించాలి.
  • రోగుల కౌన్సిలింగ్​కు సామాజిక కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్​ను నియమించాలి.
  • పీపీపీ విధానంలో రూ.10 కోట్లతో 22 పథకాలు నడుస్తున్నాయి. వీటి నిర్వహణలో సేవ దృక్పథం కొరవడింది. వీటి కొనసాగింపుపై పునరాలోచించాలి.
  • రక్తపరీక్షలు ప్రభుత్వం ద్వారానే జరగాలి. ఎమ్మారై, సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వమే కొనుగులు చేసి రోగులకు సేవలందించాలి.
  • ఏపీ వైద్య మౌళిక సదుపాయాల సంస్థ బలహీనంగా ఉంది. దీన్ని బలోపేతం చేయాలి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details