ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 4:25 PM IST

Updated : May 14, 2021, 6:42 PM IST

ETV Bharat / state

విషాదం: ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి

ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి
ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి

16:23 May 14

గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. తమ పిల్లలను విగత జీవులుగా చూసి వారి తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముగ్గురి మృతితో కొర్నెపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో విషాదం జరిగింది. ముగ్గురు బాలురు ఈతకు నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులు.. బోల్లా వర్దనబాబు (17), నేలపాటి కోటేశ్వరరావు(15), బత్తుల సుధాకర్ (17)గా గుర్తించారు. నేలపాటి కోటేశ్వరరావు, బత్తుల సుధాకర్​ పుల్లడిగుంటలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వగా.. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలను విగత జీవులుగా ఇంటికి తీసుకురావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకేసారి ముగ్గురు బాలురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండీ... నెల్లూరు, రాయలసీమ ఆస్పత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు: కృష్ణబాబు

Last Updated : May 14, 2021, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details