ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరం మండలంలోని రెండు ఆలయాల్లో హుండీల చోరీ - guntur district latest news updates

గుంటూరు జిల్లా నగరం మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెండు ఆలయాల్లో హుండీలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft in two temples at guntur
రెండు ఆలయాల్లో చోరీకి గురైన హుండీలు

By

Published : Jan 3, 2021, 5:51 PM IST

Updated : Jan 3, 2021, 8:19 PM IST

గుంటూరు జిల్లా నగరం మండలంలోని మీసాలవారి పాలెం, గూడపాటి వారి పాలెంలోని అభయాంజనేయ స్వామి ఆలయాల్లో హుండీలు అపహరణకు గురయ్యాయి. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు హుండీలు దొంగిలించారు. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరిచిన పూజారులు... హుండీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jan 3, 2021, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details