ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనార్దనస్వామి ఆలయంలో చోరీ.. కేసు నమోదు

By

Published : Apr 5, 2021, 11:14 AM IST

Updated : Apr 6, 2021, 2:29 PM IST

గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలోని జనార్ధన్ స్వామి ఆలయంలో చోరి జరిగింది. స్వామి, అమ్మవార్ల నగలను దొంగలు అపహరించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జనార్దనస్వామి ఆలయంలో చోరీ.. కేసు నమోదు
జనార్దనస్వామి ఆలయంలో చోరీ.. కేసు నమోదు

గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో మెయిన్ రోడ్డులోని జనార్ధన స్వామి గుడిలో దొంగతనం జరిగింది. దొంగలు అర్థరాత్రి గుడి తాళాలు పగలకొట్టి స్వామి, అమ్మవారి వెండి కిరీటాలు, బంగారు అభరణాలు దొంగిలించారు. వీటి విలువ సమారుగా ఒక లక్ష యాభై వేలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Last Updated : Apr 6, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details