ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడికుడి ఎస్​బీఐ చోరీ కేసు ఛేదనకు ఐదు బృందాలు - guntur district crime news

గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐ బ్రాంచిలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో ప్రవేశించి లక్షల రూపాయల నగదును అపహరించారు. ఈ కేసు ఛేదించడానికి ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానితుల సమాచారం ఇచ్చిన వారికి పారితోషకం ఇస్తామని గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.

theft in nadikudi state bank of india branch in guntur district
నడికుడి ఎస్​బీఐలో భారీ చోరీ

By

Published : Nov 21, 2020, 11:57 AM IST

Updated : Nov 21, 2020, 6:42 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో పురపాలిక పరిధిలోని నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగలు... తాళాలు పగలగొట్టి రూ.85 లక్షల రూపాయల నగదు అపహరించారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

తొలుత రూ. 90లక్షలు చోరీ జరిగినట్టు ప్రచారం జరిగింది. జిల్లా ఎస్పీ విశాల్​ గున్నీస్పందించి 85 లక్షలే అపహరణకు గురైనట్టు స్పష్టం చేశారు. మిగిలిన బంగారం మరియు లాకర్స్ భద్రంగా ఉందన్నారు. ఎక్కడ డ్యామేజీ లేదని తెలియజేశారు. దొంగలను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలియజేశారు. ఎవరికైనా ఎటువంటి అనుమానం ఉన్నా... అనుమానితులు కనిపించినా 88662 68899కు ఫోన్‌ చేసి చెప్పాలన్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని... తగిన పారితోషకం ఇస్తామని ప్రకటించారు. సీసీ కెమెర వైర్లు కట్ చేసి గ్లౌజులు వాడారని.. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని ప్రొఫెషనల్ క్రిమినల్స్ చేసిన పనిగా అభివర్ణించారు.

ఇదీ చదవండి:

మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం... బూడిదైన సామగ్రి

Last Updated : Nov 21, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details