ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు వెళ్లి యువకుడు మృతి

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.

By

Published : Sep 28, 2020, 10:41 PM IST

The young man went to swimming and died in macherla guntur district
ఈతకు వెళ్లి యువకుడు మృతి

గుంటూరు జిల్లా మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన ఆఫ్రిద్... తన స్నేహితులతో కలిసి పట్టణ శివారులోని సాగర్ మేజర్ కాలువలో ఈతకు వెళ్లాడు. నీళ్లలోకి దిగగా... ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.

గమనించిన స్నేహితులు ఆఫ్రిద్​ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆఫ్రిద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details