గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 24వ వార్డులో.. ఇంటిపన్ను రశీదు ఇచ్చేందుకు వెళ్లిన తనను ఓ గృహ యజమాని అసభ్య పదజాలంతో దూషించాడని మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం రశీదు ఇచ్చేందుకు వచ్చానని, మిగిలిన విషయాలు తనకేమీ తెలిదని చెప్పినా దూషించాడని వాపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
"ఇంటిపన్ను రశీదు ఇచ్చేందుకు వెళితే.. అసభ్యంగా దూషించాడు" - guntur district
ఇంటిపన్ను రశీదు ఇచ్చేందుకు వెళితే.. ఓ వ్యక్తి తనను దూషించాడని మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది.

'ఇంటిపన్ను ఇచ్చేందుకు వెళితే...అసభ్యంగా దూషించాడు'