ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్

By

Published : Dec 23, 2020, 8:09 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేశారు.

The semi-Christmas celebrations were held at the Mangalagiri Tdp office.
మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన మంగళగిరి ఎన్టీఆర్ భవన్​లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసిన తెదేపా నేతలు... క్రైస్తవులకు తెదేపా హయాంలో కలిగిన లబ్దిని వివరించారు.

ఆ ప్రయోజనాలు వైకాపా ప్రభుత్వంలో అందట్లేదని విమర్శించారు. నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్‍కుమార్, అశోక్ బాబు, శ్రీరామ్ తాతయ్య, పట్టాభిరామ్, గంజి చిరంజీవి, తంగిరాల సౌమ్య, పిల్లి మాణిక్యరావు, దివ్యవాణి, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details