మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు - గుంటూరు జిల్లాలో పోలీసుల దాతృత్వం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్లో పోలీసులు ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు నిరాశ్రయులు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన సాయాన్ని నిరుపేదలకు అందిస్తున్నారు.

మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు
గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి భోజనాలు, కూరగాయలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాపట్ల మండలంలోని పలు ప్రాంతాలలో పేదలకు భోజనాలు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ రావు , రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.