ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2020, 8:06 PM IST

ETV Bharat / state

మద్యానికి డబ్బుల కోసం తల్లిపై దాడి... కుమారుడిని హత్య చేసిన తల్లి

మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తనపై దాడి చేసిన తనయుడిని మెడకు తాడు బిగించి తల్లి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా నరసాయపాలెంలో జరిగింది.

guntur murder
మద్యానికి డబ్బుల కోసం తల్లిపై దాడి... కుమారుడిని హత్య చేసిన తల్లి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెంలో సాదు ఏసమ్మ భర్త చనిపోవడంతో కూలి పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. కుమారుడు చంటి మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తల్లిపై దాడికి దిగాడు. కుమారునికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడటంతో చివరకు ఇంట్లో పెనుగులాట జరిగి... నీళ్లు మోసుకొని వచ్చే కావిడకు ఉన్న తాడును కుమారుడి మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఇవీ చూడండి-దొరకని రక్తం... తలసేమియా బాధితులకు నరకం

ABOUT THE AUTHOR

...view details