ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం.. తెలంగాణ హైకోర్టులో ముగిసిన విచారణ - అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం

బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బడ్జెట్​ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అంగీకరించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్‌ ప్రసంగంపై ఓ స్పష్టత వచ్చింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు తెలిపారు.

telangana high court
telangana high court

By

Published : Jan 30, 2023, 3:48 PM IST

Telangana Budget Sessions 2023 : అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్​భవన్​ న్యాయవాదుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్‌ ప్రసంగంపై ఓ స్పష్టత వచ్చింది. ఫలితంగా రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

బడ్జెట్ సమావేశాలకు గడువు దగ్గర పడుతున్నా.. గవర్నర్ ఆమోదం లభించలేదంటూ.. ఇవాళ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉదయం విచారణ ప్రారంభమైన తరువాత.. 2.30కు వాయిదా పడింది. ఆ సమయంలో సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు ఫలించాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరు పక్షాల న్యాయవాదులు ఆ తరువాత ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతిస్తారన్నారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.

2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదం తెలపక పోవడంతో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details