ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​లో జరిగే ఫార్ములా ఈ- రేస్​కు ప్రారంభమైన కౌంట్ ​డౌన్.!​

By

Published : Jan 13, 2023, 12:31 PM IST

FORMULA E-RACE IN HYDERABAD: భారత్‌లో తొలిసారిగా ఫార్ములా- ఈ రేస్‌ ప్రపంచ పోటీలు నిర్వహించే అవకాశం.. తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముంబయిలోని.. గేట్‌ వే ఆఫ్ ఇండియా వద్ద ఫార్ములా-ఈ రేస్‌ కౌంట్‌డౌన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ వాహనాలు రేసింగ్ దేశ వాహనరంగం గతిని మారుస్తూ, కర్బనరహిత పర్యావరణహిత దిశగా అడుగులు వేసేందుకు.. ఈ కార్యక్రమం దోహదపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

FORMULA E-RACE IN HYDERABAD
FORMULA E-RACE IN HYDERABAD

FORMULA E-RACE COUNT DOWN START: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహించేందుకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఈ- రేస్‌ 30 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం జరిగింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, మంత్రి కేటీఆర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఫార్ములా- ఈ రేస్‌ నిర్వహణకు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు పోటీపడగా అన్నింటిని ఓడించి హైదరాబాద్‌ ఆ అవకాశాన్ని దక్కించుకుందని మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని.. విద్యుత్‌ వాహనాలతో కాలుష్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఫార్ములా-ఈ రేస్‌లో 9 దేశాల నుంచి ఏస్‌గ్రాండ్‌స్టాండ్‌లు, జాగ్వార్‌, నిస్సాన్‌, మహింద్రా రేసింగ్‌ వంటి 11 జట్లు 22 కార్లతో పాల్గొంటాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి వారం రోజులపాటు మొబిలిటీ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉత్పాదక సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థ నిర్వాహకులు పాల్గొంటారని.. తద్వారా దేశానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ దేశంలో తొలిసారిగా విద్యుత్‌ వాహనాల విధానం తెచ్చిందని గుర్తుచేసిన కేటీఆర్‌.. ఆ రంగంలో స్టార్టప్‌ కంపెనీలు భారత్‌ వచ్చేలా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

"విద్యుత్ వాహన రంగం అనేది కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదు. అది మనకు ఒక లక్ష్యం. ప్రపంచంలో మొదటి సారిగా ఫార్ములా రేసు ఇ- కారుతో జరగనుంది. అది నాకు ఆనందంగా, గర్వకారణంగా ఉంది. ఇది సాధ్యమయ్యేలా చేసిన అనిల్‌కుమార్, ఆయన బృందానికి శుభాకాంక్షలు." - నితిన్‌ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

"ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా-ఇ రేసుకు హైదరాబాద్‌, తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం నాకు గర్వకారణంగా ఉంది. ఇది కేవలం హైదరాబాద్‌, తెలంగాణకి సంబంధించినది కాదు. ఈ కార్యక్రమం మొత్తం దేశానిది. ఇది యాదృచ్ఛికంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. మరో నాలుగేళ్లపాటు ఈ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ఈ విషయంలో స్థిరమైన చొరవ చూపేందుకు ప్రధాని అంగీకరించారు. ఫిబ్రవరిలో మిమ్మల్ని హైదరాబాద్‌కు స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నాం. రవాణా రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. భారత్‌లో స్టార్టప్‌లు పెట్టేందుకు కలిసిరావాలి." - కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

హైదరాబాద్​లో జరిగే ఫార్ములా ఈ- రేస్​కు ప్రారంభమైన కౌంట్ ​డౌన్.!​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details