ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం - జాగర్లమూడి కాలవలో ఇద్దరు గల్లంతు

గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాలువలో గల్లంతైన యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఆదం షరీఫ్ అనే యువకుడు ఈతకు వెళ్లి కాలవలో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడటానికి ప్రయత్నించిన సాయి కుమార్ అనే యువకుడూ గల్లంతయ్యాడు.

The bodies of the youths who were lost in the canal were found at jagarlamudi
కాలువలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

By

Published : Sep 17, 2020, 9:34 AM IST

గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాలువలో గల్లంతైన ఇరువురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, ఆదం షరీఫ్ మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలలో పంచనామాకు తరలించారు. అనంతరం కుటుంబానికి అందించారు.

నిన్న ఆదం షరీఫ్ అనే యువకుడు ఈతకు వెళ్లి కాలవలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన సాయికుమార్ కాలవలో కొట్టకుపోయాడు. సాయికుమార్ భార్య గర్భవతి అని కుటుంబీకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details