ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరవకట్టలో ఉద్రిక్తత..తెదేపా-వైకాపాల మధ్య ఘర్షణ - వరవకట్టలో తెదేపా-వైకాపాల మధ్య ఘర్షణ

నరసరావుపేట వరవకట్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా ఆధ్వర్యంలో మైనార్టీలకు కోడి గుడ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టగా... వైకాపా కార్యకర్తలు అడ్డుతగిలారు. ఫలితంగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

fighting between ycp and tdp activists
fighting between ycp and tdp activists

By

Published : Nov 22, 2020, 9:12 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట వరవకట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వరవకట్ట 17వ వార్డులో మైనారిటీ ప్రజలకు కోడిగుడ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో అదే వార్డులోని వైకాపా శ్రేణులు తెదేపా నాయకులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పటంతో గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details