ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2019, 3:04 PM IST

ETV Bharat / state

ఇసుక కొరతపై తెలుగు యువత ఆందోళనలు

తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలుగు యువత ఆందోళనలు

తెలుగు యువత ఆందోళనలు

ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురాని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details