ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

376వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు - అమరావతిలో దీక్షా శిబిరాలను సందర్శించిన తెలంగాణ తెలుగు మహిళలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 376వ రోజుకు చేరింది. వారికి మద్దతుగా తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న.. ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. కొందరు ఉద్యమకారులు షిర్డీ వెళ్లి.. అమరావతికి మద్దతుగా సాయి నాథుడి శరణు కోరారు.

telangana telugu mahila support to amaravati
అమరావతికి మద్ధతుగా తెలంగాణ తెలుగు మహిళ

By

Published : Dec 27, 2020, 7:02 PM IST

అమరావతిలో రైతులు, మహిళల నిరసనకు మద్ధతుగా.. తెదేపా నేతలతో కలిసి తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న రాజధాని ప్రాంతంలో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరుల్లోని దీక్షా శిబిరాలను ఆమె సందర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 376వ రోజు నిరసన తెలుపుతున్న రైతులతో కలిసి.. వెంకటపాలెంలో ఆందోళనలో పాల్గొన్నారు.

అమరావతినే రాజధానిగా ప్రకటించాలని, ఉద్యమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని.. కృష్ణాయపాలెం రైతులు షిర్డీలో సాయి నాథుడ్ని కోరుకున్నారు. జై అమరావతి అంటూ అక్కడ నినాదాలు చేశారు. అనంతరం అమరావతికి మద్దతుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details