గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ముత్తుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో.. కంచర్ల కోటేశ్వరరావు ఆంగ్ల ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు అతను పిట్టలవానిపాలేనికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం పోలింగ్ బూత్కు వెళ్లే క్రమంలో.. అతనికి గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది.. బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి - ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి తాజా వార్తలు
గుంటూరు జిల్లాలోని పిట్టలవానిపాలెంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. గుండెపోటుతో మరణించాడు. పోలింగ్ బూత్కు వెళ్లే క్రమంలో.. గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి