ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2019, 1:05 PM IST

ETV Bharat / state

'కేసీఆర్‌తో కలిసి పట్టువస్త్రాలు సమర్పిస్తారా!'

తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలా మారుతున్నారంటూ ఎమ్మెల్సీ అశోక్​బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీ అశోక్​బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్మోహన్​రెడ్డి కీలుబొమ్మ:ఎమ్మెల్సీ అశోక్​బాబు
దుమ్ముగూడెం నుంచి నీటి సరఫరాను ఒకప్పుడు వ్యతిరేకించిన తెరాస పార్టీతో ఇప్పుడు ఏ విధంగా నాగార్జున సాగర్​కు నీటిని నల్గొండ నుంచి రప్పించటానకి ఒప్పుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అశోక్​బాబు. దుమ్ముగూడెం నుంచి నల్గొండ మీదుగా నీటిని తీసుకురావటం అనేది రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేదన్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడమేంటని ప్రశ్నించారు. దీని ద్వారా తితిదేను తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఎంత మితృత్వం ఉన్నా, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు పోగొట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీయరాదని హితువు పలికారు. గోదావరి నీటి విషయంలో ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఒప్పుకోనందునే ఆర్టీసీ ఎండీని బదిలీ చేశారంటూ తీవ్ర స్థాయులో విమర్శలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details