ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే.. సస్పెండ్​ చేస్తారా: తెదేపా

45 ఏళ్లు నిండిన ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని తెదేపా నేతలు తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నించినందుకు తమ సభ్యులను సస్పెండ్ చెయ్యడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jul 23, 2019, 3:40 PM IST

tdp fire on ycp

ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే.. సస్పెండ్​ చేస్తారా: తెదేపా

వైకాపా ఎన్నికల హామీలకు.. చేసేదానికి చాలా తేడా ఉందని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో కళా వెంకట్రావు, ఆలపాటి, వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని.. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ ఇస్తామన్నారని తెదేపా నేతలు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని సభలో అడిగినందుకు తమ సభ్యులను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details