ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramya murder case: గుంటూరు లాడ్జి సెంటర్‌లో తెదేపా నేతల ఆందోళన

By

Published : Aug 31, 2021, 12:28 PM IST

రమ్య హత్య కేసు నిందితుడిని శిక్షించకపోవటంపై తెదేపా నిరసన చేపట్టింది. గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో తెదేపా నేతల ఆందోళన చేపట్టారు. 21 రోజుల్లో నిందితున్ని శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Ramya murder case
Ramya murder case

గుంటూరు లాడ్జ్‌ సెంటర్‌లో తెదేపా నేతల ఆందోళన

రమ్య హత్య కేసు(Ramya murder case) నిందితుడిని శిక్షించకపోవటంపై గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. మహిళలపై జరిగే దాడులు, హత్యలకు సంబంధించి నిందితులను 21 రోజుల్లో శిక్షించేందుకు దిశ చట్టం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం.. ఎందుకు ఆ పని చేయలేకపోతోందని ప్రశ్నించారు. 21 రోజుల్లో రమ్య హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని తెదేపా డిమాండ్ చేసింది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలు పట్టుకుని తెలుగు యువత, మహిళలు నిరసన చేపట్టారు. 'దిశ చట్టం' పేరుతో ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆగస్టు 15 పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆగస్టు 15న ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆ రోజు రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

ఇన్​స్టాగ్రామ్​లో రమ్యతో పరిచయం పెంచుకున్న నిందితుడు శశికృష్ణ తన ప్రేమను తరచూ వ్యక్తం చేశాడు. తనపై రమ్యకు ఆసక్తి ఉందా..? లేదా.. ? అనే విషయాన్ని విస్మరించాడు. రమ్య తన ప్రేమను నిరాకరిస్తే ఎంతకైనా తెగించాలని మానసికంగా నిర్ధారణకు వచ్చి జనసమర్థం ఉన్న ప్రాంతంలోనే రమ్యపై విచక్షణారహితంగా కసితీరా కత్తితో ఆరుపోట్లు పొడిచాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గుంటూరు పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

ఇదీ చదవండి: SC COMMISSION: రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్

ABOUT THE AUTHOR

...view details