ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదు'

By

Published : Oct 14, 2020, 3:04 PM IST

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా మహిళా నాయకురాలు వేగుంట రాణి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

tdp leader venigunta  rani on ysrp government
వేగుంట రాణి

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం మతిస్థిమితం లేని వివాహిత అత్యాచారానికి గురైంది. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళను తెదేపా మహిళా నాయకురాలు వేగుంట రాణి పరామర్శించారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి భాదితరాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details