ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 11:23 AM IST

ETV Bharat / state

కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి వారే బాధ్యులు: తెదేపా

కౌలు రైతు సలీం ఆత్మహత్యాయత్నానికి.. వైకాపా నాయకుల వేధింపులే కారణమని తెదేపా నేత సయ్యద్ రఫీ ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

TDP leader Sayed Rafi
TDP leader Sayed Rafi

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వైకాపా నాయకుల వేధింపులు తట్టుకోలేకే కౌలు రైతు సలీం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. వేమూరు ఎమ్మెల్యే అండతోనే వైకాపా నాయకుడు శివారెడ్డి.. సలీం పండించిన పంటను కోసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.

హక్కులున్న వారి నుంచే వైకాపా నాయకులు భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాల పర్వం రాష్ట్రమంతా మొదలైందని.. ఎక్కడ ఆస్తులుంటే అ్కడ వైకాపా నాయకులు అడుగుపెడుతున్నారని రఫీ మండిపడ్డారు. సలీంను వేధించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details