ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్ ప్రతి మాట, సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర' - పిల్లి మాణిక్యాలరావు తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ చెప్పే ప్రతి మాట వెనుక, అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర దాగి ఉంటుందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని మండిపడ్డారు.

tdp leader pilli manikyala rao fire on ycp govt
సీఎం జగన్ ప్రతి మాట, సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర

By

Published : Jun 8, 2021, 6:51 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. సీఎం జగన్ చెప్పే ప్రతి మాట వెనుక, అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర దాగి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారన్నారు.

కరోనా నివారణకి ఆనందయ్య ఇచ్చే మందు డబ్బాలపైనా వైకాపా బొమ్మలు వేసుకోవడం సిగ్గుచేటని ఆక్షేపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వ విధానాలను, మోసపూరిత వాగ్దానాలపై నిలదీయాలని సూచించారు.

ఇదీచదవండి:పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం

ABOUT THE AUTHOR

...view details