ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు అందుకే కోర్టుకెళ్లారు: ఆలపాటి రాజా - వైకాపాపై మండిపడ్డ ఆలపాటి

రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకపోవటంతో... ప్రజలు ఆ విషయంపై కోర్టుకు వెళ్లారని తెదేపా నేత ఆలపాటి రాజా అన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే భావన వైకాపా ప్రభుత్వానికి సరికాదన్నారు.

tdp leader alapati raja fires on ycp and feels happy for status co on amaravathi issue
ప్రజలు అందుకే కోర్టుకెళ్లారు: ఆలపాటి రాజా

By

Published : Aug 14, 2020, 3:25 PM IST

రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకపోవటంతో... ప్రజలు కోర్టుకు వెళ్లారని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. రాజధాని తరలింపు ప్రక్రియ నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27 వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు చెప్పటాన్ని ఆయన స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తామేం చేసినా చెల్లుతుందనే భావన వైకాపాకు సరికాదని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details