ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు' - తప్పుడు కేసులో అరెస్ట్ చేసిన తెదేపా నేతలను విడుదల చేయాలంటూ అరండల్​పేట సీఐకి శ్రావణ్ కుమార్ వినతిపత్రం

అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలు ఏడుగురిని వెంటనే విడుదల చేయాలంటూ.. అరండల్​పేట సీఐకి గుంటూరు తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నేతలు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అడ్డుకున్న వారినే తిరిగి అరెస్ట్​ చేశారని పేర్కొన్నారు. ఆ కేసు నిలబడదని తెలిసి చోరీ కేసులు పెట్టినట్లు ఆరోపించారు.

sravan kumar demands to release arrested tdp leaders in guntur
తప్పుడు కేసుల్లో అరెస్ట్​ చేసిన తెదేపా కార్యకర్తలను విడిచిపెట్టాలని గుంటూరులో శ్రావణ్ కుమార్ డిమాండ్

By

Published : Mar 20, 2021, 10:27 PM IST

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని.. తెదేపా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసుల అండతో తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన ఏడుగురు తెదేపా నేతలను తక్షణమే విడుదల చేయాలంటూ.. న్యాయవాదులతో కలిసి వెళ్లి అరండల్​పేట సీఐకి వినతి పత్రం అందజేశారు. కేసులతో సంబంధం లేని వ్యక్తులను స్టేషన్​కి పిలిపించి.. నాలుగు రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కార్పొరేషన్ ఎన్నికలకు ముందు రోజు.. 50వ డివిజన్​లో వైకాపా నేతలు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేశారని శ్రావణ్ కుమార్ తెలిపారు. దానిని అడ్డుకున్న తెదేపా అభ్యర్థి, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులు చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు పంచిన వారిని వదిలేసి అడ్డుకున్న తెదేపా మద్దతుదారులను అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ కేసు నిలబడదని తెలిసి.. ఏడుగురు కార్యకర్తలపై చోరీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వారి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తరువాత పోలీసులు స్పందించి.. అరెస్ట్ చేసిన వారిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. వైకాపా నేతలు తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details