ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కావాలనే ఈ సమయంలో రైతులను వేధిస్తున్నారు'

కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు ఏప్రిల్ 28లోగా వెళ్లాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. హైకోర్టు తీర్పును లెక్కచేయ‌కుండా... అమరావతి రైతులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

By

Published : Apr 12, 2020, 10:15 PM IST

tdp-devineni
tdp-devineni

ఏప్రిల్‌ 28వ తేదీలోపు కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు వెళ్లాలని... ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అమరావతి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో హైకోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో... కేవలం కొన్ని మండలాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని సూచించడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలపైన ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details