ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి: తెదేపా - గుంటూరు జిల్లా వార్తలు

బలహీన వర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మర్రుప్రోలు వారిపాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp comments
tdp comments

By

Published : Sep 12, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారి పాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిలదీసిన బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడారు. తెదేపా నేతలు మర్రుప్రోలు వారి పాలెం సందర్శించారు.

బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో బలహీనవర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details