ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికల వేళ దాడులు.. ఈసీ నిబద్ధతపై అనుమానం'

మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. తెదేపా నేతలపై దాడులు ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని తెదేపా నేత టీడీ జనార్దన్ అన్నారు. జయదేవ్ ఇంటిపై దాడులను ఆయన ఖండించారు.

By

Published : Apr 10, 2019, 9:36 AM IST

Updated : Apr 10, 2019, 12:34 PM IST

టీడీ జనార్ధన్

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం, ఇంటిపై ఐటీ దాడులను తెదేపా నేత టీడీ జనార్దన్ ఖండించారు. ఎన్నికల సంఘం అధికారుల చర్యలను తప్పుబట్టారు. ఏడాది నుంచి జయదేవ్​ను అనేక రకాలుగా వేధిస్తున్నారన్నారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ మొదలుకానున్న పరిస్థితుల్లో... ఇలాంటి దాడులతో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీని ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్పీపై చర్యలు తీసుకోవడం దారుణమని.. ఈ చర్యలు ఎన్నికల సంఘం నిబద్ధతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఈసీని కోరారు.

Last Updated : Apr 10, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details