ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారుల తీరుపై పురుగు మందు డబ్బాతో రైతు ధర్నా

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం..తమ పొలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో రైతు కుటుంబం..... పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగింది. అసలు ఆ భూమి వారిది కాదంటూ తహసీల్దార్ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.

By

Published : Feb 26, 2020, 12:27 PM IST

Published : Feb 26, 2020, 12:27 PM IST

Tahasildar respond on kommuru farmers land issue in guntur
ఆ భూమి ఆర్మీ వారికి ఇవ్వలేదు.. వీరిదీ కాదు

ఆ భూమి ఆర్మీ వారికి ఇవ్వలేదు.. వీరిదీ కాదు

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వివాదంలో ఉన్న భూమిని ఆర్మీలో పని చేసిన వ్యక్తికి ఇవ్వలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు చెప్పారు. భూమి వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పెట్టడంపై షేక్ జిలానీ అనే రైతు మండిపడ్డారు. భూమి తమదేనని.. ఇలా చేయడం అన్యాయమని ఆవేదన చెందుతూ పురుగు మందు డబ్బాతో నిరసనకు దిగారు. ఈ విషయమై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. 1978లో గుళ్లపల్లి హిదాయత్, గఫార్​ను నిరుపేదలుగా పరిగణించి కేవలం సాగు నిమిత్తం ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్ఎస్ఆర్​ లోనూ వారి పేర్లు నమోదు చేసిన్నట్లు చెప్పారు. ఆర్మీలో పని చేసిన వారికి ఆ భూమి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details