ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి కోసం తాడికొండ రైతుల బైక్​ ర్యాలీ

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండల పరిధిలోని రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. మూడు రాజధానుల పేరిట ఐదు కోట్ల మంది ఆంధ్రుల అభివృద్ధిని నాశనం చేయొద్దని కోరారు.

By

Published : Feb 3, 2020, 9:27 AM IST

Published : Feb 3, 2020, 9:27 AM IST

అమరావతి కోసం ర్యాలీ నిర్వహిస్తున్న తాడికొండ రైతులు
అమరావతి కోసం ర్యాలీ నిర్వహిస్తున్న తాడికొండ రైతులు

అమరావతి కోసం ర్యాలీ నిర్వహిస్తున్న తాడికొండ రైతులు

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రైతులు, మహిళలు... అమరావతిలో రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తాడికొండ క్రాస్ రోడ్డు నుంచి పొన్నెకళ్లు, రావెల, బేజాతపురం, పాములపాడు, గ్రామాల మీదుగా రైతులు బైక్​ ర్యాలీ చేయగా... మహిళలు జై అమరావతి అని నినదిస్తూ పాదయాత్ర నిర్వహించారు. అమరావతి సాధించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరిట ఐదు కోట్ల ఆంధ్రుల అభివృద్ధిని నాశనం చేయొద్దని కోరారు.

ఇదీ చూడండి:వారంలో 'రైతు రక్షణ బస్సు యాత్ర'

ABOUT THE AUTHOR

...view details