ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిని తరలిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధం' - taadi konda protest

రాజధాని అమరావతిని తరలిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని... గుంటూరు జిల్లా తాడికొండ రైతులు నినాదాలు చేశారు.

taadi konda protest
రాజధాని పై తాడికొండ రైతుల ఆందోళన

By

Published : Dec 27, 2019, 1:47 PM IST

'మూడు రాజధానులు వద్దు- ఒక రాజధానే ముద్దు' అని... గుంటూరు జిల్లా తాడికొండ మండలం రైతులు నినాదాలు చేశారు. తాడికొండ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. అమరావతి రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని... తమ భూములు పనికిరాకుండా పోయాయని వాపోయారు. ఇప్పుడు మా పరిస్థితేంటని రైతులు ప్రశ్నించారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని తరలిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి... రాజధాని గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details