గుంటూరులోని కొరిటిపాడులో విజయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. వాకింగ్ ట్రాక్ చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలు.. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అరండల్ పేట సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - guntur latest news
గుంటూరులోని కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ చెరువు వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
![అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి suspicious women death in koritipadu guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8981283-32-8981283-1601372290564.jpg)
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి