ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2023, 10:47 PM IST

ETV Bharat / state

మాజీ సీఎస్‌ సమీర్‌శర్మపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

మాజీ సీఎస్​ సమీర్‌శర్మకు తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో కోర్టు ఉత్తర్వులను పాటించలేదని.. వాటి అమలుపై సమాధానం చెప్పాలంటూ... సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్​ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి... కేసు తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది..

Supreme Court notices to former CS Sameer Sharma
Supreme Court notices to former CS Sameer Sharma

Former AP CS Sameersharma: మాజీ సీఎస్​ సమీర్‌శర్మకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం విషయంలో నోటీసులిచ్చింది. పరిహారం అందించడంలో ఉత్తర్వులు పాటించలేదంటూ... ప్రాజెక్టు నిర్వాసితుడు వెంకట్‌రెడ్డి... కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్​ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిహారం చెల్లింపులో కోర్టు ఉత్తర్వుల అమలుపై సమాధానం చెప్పాలంటూ... మాజీ సీఎస్ సమీర్‌శర్మకు నోటీసులు జారీచేసింది. అదే సందర్భంలో పిటిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఒకవేళ.. ప్రభుత్వం పరిహారమంతా చెల్లించినట్లు రుజువైతే... భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసు విచారణను మార్చి 13కు వాయిదా వేసింది..

ABOUT THE AUTHOR

...view details