గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లోకోపైలట్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది.కానీ, ఆ యువకుడు తన రెండు పాదాలు కోల్పోయాడు.
క్షతగాత్రుడిని తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించారు. కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. అదే రైలులో విజయవాడ తరలించారు. రైల్వేస్టేషన్ నుంచి 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.