ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం సుదర్శన యాగం - అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం

అమరావతిని రాజధానిగా కొనసాగించేలా సీఎం జగన్​మోహన్​​రెడ్డి మనసు మార్చాలని కోరుతూ... రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం చేపట్టారు.

Sudarshana Yagam for amaravathi at Uddandarayunipalem in guntur district
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం

By

Published : Mar 15, 2020, 12:57 PM IST

అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం

అమరావతి కోసం మూడు నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న అన్నదాతలు తాజాగా ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం చేపట్టారు. అమరావతి రాజధానిగా ప్రధాని మోదీ భూమిపూజ చేసిన ప్రాంగణంలోనే రాజధాని రైతులు, మహిళలు ఈ యాగం నిర్వహిస్తున్నారు. భాజపా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి రావెల కిషోర్​బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​​రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించి... రాజధాని తరలిపోకుండా కాపాడాలని మహిళలు కోరుతున్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.... రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. రాజధాని ఇక్కడే కొనసాగించి శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయాలని భగవంతుడుని ప్రార్థించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details