గుంటూరులోని శ్యామల నగర్ బాలుర పాఠశాల విద్యార్థులు మట్టి , గోధుమ, పిండి , పత్రం, పుష్పం , ఫలం, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవాటితో లంబోదరుడిని తయారు చేశారు. మట్టి విగ్రహాలు వివిధ రూపాల్లో తయారు చేసిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులతో అభినందించారు. అనంతరం విద్యార్థులు పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ ... విగ్రహాల తయారీలో సృజనాత్మకత వలన పిల్లల్లో ఒత్తిడి తగ్గిస్తుందని, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు . మార్కులు ఒకటే విద్యకు పరమార్ధం కాదని, విద్యార్థికి సృజనాత్మకత ఎంతో అవసరం అన్నారు ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రకృతి గణపతులు..పర్యవరణానికి పరిరక్షకులు.. - guntur district
కాలుష్య రహిత సమాజానికి పర్యావరణ పరిరక్షణకు మేము సైతం భాగస్వాములంటూ శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ విద్యార్థులు నడుంబిగించారు. వినాయక చవితి సందర్భంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు తయరుచేశారు.
![ప్రకృతి గణపతులు..పర్యవరణానికి పరిరక్షకులు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4313086-137-4313086-1567396257872.jpg)
students made types of ingridians at srivenkateswara bala kutir in guntur district
ప్రకృతి గణపతులు..పర్యవరణానికి పరిరక్షకులు..