స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 107 మీటర్ల భారీ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు. శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. మంగళగిరి మెయిన్ బజార్ నుంచి గాంధీ విగ్రహం వరకు వివిధ పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులు ఈ ర్యాలీ తీశారు. భారత మాతకు జై అంటూ నినాదాలు చేశారు.
మంగళగిరిలో 107 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
మంగళగిరిలో భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు.
Students displayed national flag of 107 meters at Mangalgiri in guntur district