ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తాం: నాగిరెడ్డి - crop damaged areas in guntur district latest news

నివర్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని... రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వరి, తమలపాకు తోటలను ఆయన పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.

State Agriculture Mission Vice Chairman Nagireddy visits crop damaged areas in guntur district
పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తాం: నాగిరెడ్డి

By

Published : Dec 4, 2020, 7:02 PM IST

తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు... నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఉప్పరపాలెం, సీతారామపురం, కసుకర్రు గ్రామాల్లో వరి, చింతలపూడి గ్రామంలో తమలపాకు తోటలను జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్​తో కలిసి ఆయన పరిశీలించారు.

కేంద్ర ప్రభుత్వం ఇన్​పుట్​ సబ్సిడీగా... హెక్టారుకు రూ.15 వేలుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిందన్నారు. ఈ క్రాఫ్ యాప్​​లో పేర్లు నమోదు కానీ వారికి కూడా నమోదు చేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తమలపాకు పంటకు ఎకరాకు రూ.30 వేలు మాత్రమే నష్ట పరిహారం అందించేందుకు అవకాశం ఉందన్నారు. అవి కూడా నేరుగా కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలనే వాటిపై చర్యలు తీసుకోవాలని జేసీ దినేష్ కుమార్ స్థానిక అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఇదేనా రైతులకిచ్చే ప్రాధాన్యం!

ABOUT THE AUTHOR

...view details