ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండ అరిసెకు ఓ కథ..

దేవస్థానాల్లో ప్రసాదంగా లడ్డూలు ఉంటాయి. అన్నవరంలో మాత్రం కాస్త ప్రత్యేకంగా గోధుమనూకతో వండివార్చిన ప్రసాదం అపురూపంగా భావిస్తారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో మాత్రం మరెక్కడా లేని విధంగా అరిసె​ ఉంటుంది. దీన్ని ప్రసాదంగా మాత్రమే కాకుండా స్వామివారికి నివేదన కూడా చేస్తారు. త్రికోటేశ్వరుని సన్నిధిలో ఈ ప్రసాదం ఎలా వచ్చిందంటే.....

By

Published : Mar 11, 2021, 6:20 PM IST

kotappa konda temple
కోటప్పకొండ అరిసెకు ఓ కథ..

త్రికోటేశ్వరస్వామి దేవస్థానం చరిత్రలో 1990వ దశకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కోటప్పకొండకు ఘాట్​మార్గ నిర్మాణం, ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే త్రికూటాచలంపై ప్రత్యేకత చాటేలా ప్రసాదం ఉండాలన్న ఆలోచన చేశారు. అప్పటి మంత్రి డాక్టర్​ కోడెల శివప్రసాదరావు, వేదపండితులు చర్చించి అరిసెను నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీని తీసుకొచ్చారు. భగవంతుని నైవేద్యంగా సమర్పించే వాటిని భోగాలని పిలుస్తారు. స్వామికి సమర్పించే భోగాల్లో పులిహోర, చక్రపొంగాలి వంటివి ఉన్నాయి.

ఈ క్రమంలోనే అపురూపం(అరిసె)ను స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా గుర్తించి ఇక్కడ అమలు చేయడం ప్రారంభించారు. స్వామికి అరిసె ప్రసాదం నివేదన చేసిన తర్వాత కౌంటర్లకు తరలించి భక్తులకు విక్రయిస్తారు. వీటిని కోటప్పకొండపైన వంటశాలలో తయారు చేస్తారు. ఈ అరిసె తయారీకి ప్రత్యేక దిట్టం అమలు చేస్తారు. 360 అరిసెల తయారీకి ఉపయోగించాల్సిన వస్తువులను దిట్టం అపిగా పిలుస్తారు. ఒక పట్టీలో 5కిలోల నెయ్యి, 12కిలోల బియ్యం, 8కిలోల బెల్లం, 100గ్రాముల యాలకులు, 5గ్రాముల పచ్చకర్పూరం వినియోగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి, పచ్చకర్పూరం వాడకంతో అరిసెకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. నెలకు 20వేల అరిసెలు స్వామి వారి వంటశాల్లో తయారౌతాయి. అదే కార్తికమాసం, మహాశివరాత్రి సమయాల్లో లక్షకుపైగా భక్తుల కోసం సిద్ధం చేస్తారు.

ఇదీ చదవండీ...సబ్బుపై శివయ్యని చిత్రీకరించిన సూక్ష్మ కళాకారుడు

ABOUT THE AUTHOR

...view details