ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలు పాటించకపోతే...కఠిన చర్యలు తప్పవు'

గుంటూరు నగరంలోని చిరువ్యాపారులు, మెడికల్ దుకాణాల యజమానులకు కొవిడ్​పై అవగాహన కల్పించారు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By

Published : Apr 11, 2021, 8:10 PM IST

SP Ammireddy
ఎస్పీ అమ్మిరెడ్డి

కరోనాపై నిరంతర పోరులో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నగరంలోని పలుప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణ, నియంత్రణ అమలు తీరును పరిశీలించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారులకు కొవిడ్​పై అవగాహన కల్పించారు. డీమార్ట్​ని సందర్శించిన ఎస్పీ.. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. చిరు వ్యాపారులు, మెడికల్ షాప్ యజమానులను పిలిచి పాటించవలసిన నియమాలను గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details