ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతితో అనుచిత ప్రవర్తన.. ఎస్సై , కానిస్టేబుల్​పై వేటు - గుంటూరు అరండల్ పేట ఎస్సై సస్పెండ్ న్యూస్

యువతితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్​పై వేటు పడింది. గుంటూరు జిల్లా అరండల్ పేటలో యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువతితో ఎస్సై బాలకృష్ణ విచారణలో బాగంగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు హోంమంత్రి, ఎస్పీలను ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు.

si
si

By

Published : Jan 30, 2020, 11:32 AM IST

Updated : Jan 30, 2020, 12:18 PM IST

యువతిపై అనుచిత ప్రవర్తన.. సిబ్బందిపై వేటు

యువతితో అనుచిత ప్రవర్తన ఆరోపణలతో... గుంటూరు అరండల్ పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ సీహెచ్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతో పాటు తన తల్లితో...ఎస్సై, కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించారని యువతి ఆరోపించింది. గత నెల 31న... తనపై ఎస్సై బలాత్కారం చేశాడంటూ... హోంమంత్రి సుచరిత, ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించింది. వారు కేసును గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజకు బదిలీ చేయగా... తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్లతో పాటు.. చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణపై మరో కానిస్టేబుల్ హనుమంతరావును విధుల నుంచి బహిష్కరించారు.

ఇవీ చదవండి:

చంపుతాడనే భయంతో..తండ్రిని చంపేశాడు

Last Updated : Jan 30, 2020, 12:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details