NEW CS JAWAHAR REDDY : ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తానని,.. పల్లెపల్లెకు, ప్రతి పౌరుడికి పాలనా ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని కొత్తగా నియమితులైన జవహర్రెడ్డి అన్నారు. సీఎస్ సమీర్శర్మ పదవీకాలం ఈరోజు సాయంత్రం 4గంటలకు ముగియడంతో.. జవహర్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జవహర్రెడ్డికి సచివాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 1న జవహర్రెడ్డి బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా.. ముహూర్తం బాగుండటంతో సచివాలయం మొదటి బ్లాక్లో ఈరోజే బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తాం: సీఎస్ జవహర్రెడ్డి
CS JAWAHAR REDDY: ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డికి సమీర్శర్మ బాధ్యతలు అప్పగించారు. సచివాలయం మొదటి బ్లాక్లో జవహర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
CS JAWAHAR REDDY
Last Updated : Nov 30, 2022, 8:37 PM IST